Duppelly is a village in Yadadri Bhongir district, in Telangana, India. It falls under Valigonda Mandal, Pincode 508112,

Duppelli
Village
Country India
StateTelangana
Area
 • Total5 km2 (2 sq mi)
Languages
 • OfficialTelugu
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationTS



Story of Duppelly

దుప్పల్లిః చర్రిత

edit

    నల్గొండ జిల్లా వలిగొండ మండలంలో దుప్పెల్లి అనే వూరుంది.ఆ వూరు కాకతీయప్రతాపరుద్రుని ఏలుబడిలో వున్న ఒక నాయంకరం.దీనిని దుప్పల్లి బొల్లమరాజు ఒకపాలు,రంగయరుద్రదేవుడు మూడుపాళ్ళుగా పాలించేవారు నాగులకుంట(నాగులతూము)కు పడమట వుండే కాశ్మీరదేవాలయంలోని కాశ్మీరదేవునికి నిత్యభోగనిమిత్తం అష్టాదశ(కులాల)ప్రజలసన్నిధిలో రెండుకాలాలు పంటలుపండే నాలుగున్నర మర్తురుల తరిపొలాన్ని సర్వమాన్యముగా దానం చేసారు.ఈ భూమి సబ్బిసముద్రము వెనక, నేరడ్ల చేనులో ముయ్యడ్డాను,నాగులతూము కుట్రుచేను మర్తురు,కాన్యానిచెరువు వెనక రావిచేను అడ్డాను,నారాయణదేవరచెరువు వెనక తామరపడెచేను ముుయ్యడ్డాను కలిపి నాలుగుమర్తురులు,తామరపడె మునిగితే దానికి బదులుగా సోమయకాలువ మొదట జిలగవారి మర్తురు ఇస్తామని, కప్పము మాడలో చిన్నంబాతిక దేవరభోగానికే ఇచ్చినారు.సమస్తప్రజలందరు కలిసి దేవరదీపాలకై విడిచిన పన్నులన్నింటిలో మాడ,వీీసము తీసి పెట్టాలని శాసించారు.

edit

(Inscriptions of AP- Nalgonda, vol-I, No.96   pg no276)

edit

ఇపుడు దుప్పెల్లిలో ఆ కాశ్మీరదేవాలయం శిథిలదుస్థితిలో వుంది.దేవాలయం,దేవునిమాన్యాలు పోయనయి.ఒకప్పటి గొప్పచరిత్రకు ఆనవాలుగా శిథిలాలే వున్నాయి.మూసీనదికి ఉత్తరం ుఒడ్డున వుండే ఈవూరు నిజాం కాలంలో దేశముఖుల జాగీరు.నిషానీగా అప్పటి గడి మిగిలివుంది.అరవైవూర్ల పట్టేదారట ఆ దేశముఖ్ గారు.

edit

        ఇపుడున్న వూరికి తూర్పున వుండేదట వూరు  ఒకప్పుడు.ఆ పాటిగడ్డ దగ్గర అవశేషాలు కొన్ని మిగిలివున్నాయి.చాళుక్యులకాలంనాటి సుందర గణపతి(ముందు,వెనక కూడ చెక్కిన)శిల్పం వుంది.మత్స్యకారులు మూసీనది దగ్గర గంగమ్మకు గుడి కట్టి,ఎక్కడెక్కడో పడివున్న విగ్రహాలను అక్కడ చేర్చారు.ఇంకా అక్కడ ఏనుగులును కట్టిన రాతిగడలు కోటవంటి నిర్మాణపు జాడలు కనిపిస్తున్నాయక్కడ.ఇక్కడ ఎల్లమ్మ దేవత బావిలో వెలసివుండడం ప్రత్యేకం.

edit

రచయిత:ఒకప్పుడు నేను (శ్రీరామోజు హరగోపాల్) టీచరుగా పనిచేసినందువల్ల అక్కడి శిష్యుడు తండా

edit

వెంకన్న నన్ను,వేముగంటి మురళీకృష్ణను ఆ వూరి చారిత్రకప్రదేశాలకు తిప్పి చూపించాడుReferences

edit